తెలంగాణ

జడ్పీ చైర్‌పర్సన్లతో నేడు ఎస్‌ఎఫ్‌సీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్లతో రాష్ట్ర ఆర్థిక కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) మంగళవారం సమావేశం నిర్వహిస్తోంది. బేగంపేటలోని హోటల్ ప్లాజాలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతోందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. చైర్‌పర్సన్ల విధులు, నిధులు తదితర అంశాలపై చర్చిస్తారు. ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.