తెలంగాణ

మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ గురువారం సంతాపం తెలిపింది. కొత్త మున్సిపల్ చట్టం కోసం శాసనసభ సమావేశాలను గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలు శుక్రవారం పూర్తవుతాయి. గురువారం సభ ప్రారంభం కాగానే మరణించిన మాజీ ఎమ్మెల్యేలు బొమ్మా వెంకటేశ్వర్‌రావు (ఇందుర్తి), సి. కనకారెడ్డి (మల్కాజిగిరి), బండారి శారా రాణి (పరకాల), గట్ట్భుముడు (గద్వాల), ఏ. కృష్ణమూర్తి (కామారెడ్డి), డెల్లా గాడ్ ఫ్రే (నామినేటెడ్) లకు సంతాపం తెలుపుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించారు.