తెలంగాణ

టీఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్న ఉద్యమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 23: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేసులు టీఆర్‌ఎస్, బీజేపి నేతలను వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యమం నాటి రైల్వే కేసులను రైల్వే శాఖ కొన్నింటిని ఎత్తివేసినప్పటికీ మరికొన్ని కీలక కేసులు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాజీపేటలో జరిగిన రైల్ హైజాక్ కేసులో సమన్లను ఇప్పటికే ఆర్పీఎఫ్ పోలీసులు అందజేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే కోర్టుకు బుధవారం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సహా మరో 18మంది టీఆర్‌ఎస్, బీజేపి నాయకులు హాజరుకానున్నారు. 2011 ఏప్రిల్ 14న కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింద ప్రయాణికులతో వెళ్తున్న కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ను టీఆర్‌ఎస్ నాయకులు నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు రైలును అపగా దాదాపు 12 గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ సంఘటనను తీవ్ర నేరంగా పరిగణించిన రైల్వే శాఖ ఆందోళనకారులపై రైల్ హైజాక్ కేసు నమోదు చేసింది. ఈ ఆందోళనను ముందుండి నడిపించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఏ 1 నిందితుడిగా పేర్కొన్నారు. మొత్తం 18 మంది నిందితులు కాగా ఇందులో ఇద్దరు బీజేపి నాయకులు కూడా ఉన్నారు. ఈ కేసు గత 8 సంవత్సరాలుగా కాజీపేట రైల్వే కోర్టులో విచారణ సాగుతుండగా ఇటీవలే ఈ కేసును నాంపల్లి రైల్వే కోర్టుకు బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం నాంపల్లి రైల్వే కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. రైల్‌రోకో లాంటి సంఘటనలు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కేసుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రులు హరీష్‌రావు అనేక మంది సీనియర్ నేతలు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నవారే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో అనేక కేసులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ముఖ్యమంతి, మంత్రులపై ఉన్న రైల్వే కేసులు సైతం అసెంబ్లీ ఎన్నికల ముందే కొట్టేశారు. కాని రైల్ హైజాక్ తీవ్రమైన నేరం కావడంతో ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు నిరూపణ అయినట్టయతే ఈ కేసులో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నాంపల్లి రైల్వే కోర్టు వెలువరించే తీర్పుపై టీఆర్‌ఎస్ పార్టీలో ఉత్కంఠత నెలకొంది. ఈ తీర్పు నేపథ్యంలో వరంగల్ నగరంలో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.