తెలంగాణ
లాభాల బాటలో వేర్హౌసింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలోని గిడ్డంగులు, గోదాముల ద్వారా రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్కు లభించిన లాభం నుండి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 6.50 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఒక చెక్కును రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేల్ సోమవారం రాష్ట్ర వేర్హౌజింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి సచివాలయంలో అందించారు. వేర్హౌసింగ్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు షేర్లు కలిగి ఉన్నాయి. దాంతో ఈ కార్పొరేషన్కు లభించే లాభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు వెళ్తాయ. ఇందులో భాగంగానే 6.50 కోట్ల రూపాయల చెక్కును మంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో వేర్హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, కార్పొరేషన్ కార్యదర్శి బజార్, అధికారులు మధుసూదన్రెడ్డి, సంతోష్రెడ్డి, సుధారాణి, వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
చిత్రం...మంత్రికి చెక్కును అందిస్తున్న వేర్హౌసింగ్ చైర్మన్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నిరంజన్రెడ్డి