తెలంగాణ
బడ్జెట్లో ఉపాధి కూలీలకు తీరని అన్యాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: సీఎం కేసీఆర్ మాటల్లో తప్ప చేతల్లో రైతాంగానికి తగిన న్యాయం చేయలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, ప్రధాన కార్యదర్శి టీ వెంకట్రాములు పేర్కొన్నారు. దళితులకు, గిరిజనులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేటాయింపులే లేవని అన్నారు. ఉపాధి హామీ పనులకు కేటాయించాల్సిన నిధుల్లో 25 శాతం కోత విధించడం అత్యంత దారుణమని అన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుండి రావల్సిన నిధులు 9వేల కోట్ల రూపాయిలు రాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించి రోజుకు 600 రూపాయిలు కూలీ ఇవ్వాలని ఒకవైపు కూలీలు ఉద్యమాలు చేస్తుంటే నిధులలో అడ్డగోలుగా కోతలు పెట్టి కూలీల నోట్లో మట్టికొట్టడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా బడ్జెట్లో సవరణలు చేసి నిధులు పెంచాలని వారు సూచించారు.