తెలంగాణ

అక్టోబర్ 15 వరకు ఓటరు పరిశీలన చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 16: ఓటరు పరిశీలన కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 15 వరకు పౌరులు వారి వివరాలను పరిశీలించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తె లిపారు. ఓటరు పరిశీలన కార్యక్రమంపై సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫౌరులు ఇది వరకే ఓటు హక్కు కలిగి ఉన్న వారు వారి ఓటుకు సంబంధించిన వివరాలను నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టుల్ ద్వారా, ఓటరు సహయక యాప్ ద్వారా వచ్చే నెల 15 వరకు పరిశీలించుకోవచ్చని ఏదైన తప్పులు ఉంటే సంబంధించిన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలని చెప్పారు. మీసేవా కేంద్రాల ద్వారా కూడా చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 2,47,800 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 138 మంది ఓటర్లు మాత్రమే వివరాలను పరిశీలించుకున్నారని తెలిపారు.