తెలంగాణ

ఇద్దరు అనుముల మండల యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలియా: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంలో నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన సురభి రవీందర్, పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారు. మండల కేంద్రం హాలియా పట్టణానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు లక్ష్మమ్మల కుమారుడు సురభి రవీందర్ మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన పాశం కృష్ణారెడ్డి, పద్మల కుమారుడు తరుణ్‌రెడ్డి హైద్రాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఫైట్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అదివారం సెలవుదినం కావడంతో వీరిద్దరితో పాటు మరో ఐదుగురు సహచరులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రచలం నుండి రాజమండ్రికి వెళ్లి అక్కడి నుండి ప్రైవేట్ లాంచీలో గోదావరిలో పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవిపట్నం సమీపంలో లాంచీ దుర్ఘటనకు గురై వీరిద్దరు గల్లంతయ్యారు. ప్రమాద విషయం తెలియగానే హాలియా, రామడుగు గ్రామాల్లో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం తల్లితండ్రులు, బంధువులు తమ పిల్లల ఆచూకీ కోసం రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. రెస్క్యూ టీం జరిపిన గాలింపు చర్యల్లో తమ పిల్లల ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో, బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

*గల్లంతయిన సురభి రవీందర్, పాశం తరుణ్‌రెడ్డి (ఫైల్‌ఫొటో)