తెలంగాణ

టీఆర్‌ఎస్ కారులో మజ్లిస్ సవారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో స్టీరింగ్ ఉన్నా, రిమోట్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని, వేలాది మంది ప్రజల బలిదానాలతో హైదరాబాద్ సంస్థానం విముక్తి చెందితే విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు టీఆర్‌ఎస్ జంకుతోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్టల్రోని మరాఠ్వాడ, కర్నాటకలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాలు జరిపుతోందన్నారు. సంస్థానం రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో తీవ్ర పోరాటం జరిగితే, ఇక్కడ కేసీఆర్ ఎందుకు విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ ఆయన బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా వల్లనే కాశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు సాధ్యమైందన్నారు. జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేందుకు ఆ నాడు సర్దార్ పటేల్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణమైందన్నారు. కాశ్మీర్ వ్యవహారాలను నడిపిన నెహ్రూ విఫలమయ్యారన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం బీజేపీ లక్ష్యమన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, ఈ దిశగా గత ప్రభుత్వాలపై పోరాడారని, కాని అధికారం వచ్చిన వెంటనే మాట తప్పారన్నారు. మజ్లిస్‌తో ఉన్న పొత్తు, మిత్ర పక్షమైనందు వల్ల వాళ్లు చెప్పినట్లు కేసీఆర్ వింటున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి,

రజాకార్ల అరాచకాల

నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన ఈ రోజును స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం క్షమించరాని నేరమన్నారు. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుండగా తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం పాలనలోనే మగ్గారని గుర్తుచేసారు. సుమారు 13 మాసాల పోరాటం తరువాత తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. ఇలాంటి రోజును కేసీఆర్ అధికారికంగా జరపకపోవడం ఆయనకు మజ్లిస్ పార్టీలో ఉన్న లోపాయికారీ ఒప్పందమే కారణమన్నారు. భారతావనితో మాత్రం కలవమని, పాకిస్తాన్‌తో కలవడానికి సిద్ధమని భీష్మించిన నిజాం మెడలు వంచి దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గుర్తుచేసారు. హైద్రాబాద్ మహానగరాన్ని బారత సైన్యం చుట్టుముట్టడంతో నిజాం రాజీకి వచ్చేలా చేసిందన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీకి ఈ గొప్పతనం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ నేతలు డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నేతలు నల్లు ఇంద్రాసేనారెడ్డి, చింతాసాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం కేంద్రమంత్రి మహా సంపర్క అభియాన్‌లో భాగంగా మీడియా సంస్థ అధినేత నరేంద్రచౌదరిని కలిశారు. 370వ అధికరణ రద్దు గురించి వివరించారు. 370వ అధికరణ రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన అనంతరం దేశంలోని ప్రముఖులను బీజేపీ నేతలు కలుస్తుంటారు.

*చిత్రం... సభలో మాట్లాడుతున్న కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి