తెలంగాణ
హుజూర్నగర్ టీఆర్ఎస్ టికెట్ నాకే ఇవ్వాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
హుజూర్నగర్, సెప్టెంబర్ 19: త్వరలో జరుగనున్న హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి తల్లి, కాసోజు శంకరమ్మ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడా రు. 2014లో జరిగిన ఎన్నికల్లో హుజూర్నగర్ నుండి తనకు టికెట్ ఇచ్చారని, 2018లో శానంపూడి సైదిరెడ్డికి ఇచ్చినా ఓడిపోయారని అన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రానున్న ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇవ్వాలని, కాకుంటే ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితకు ఇచ్చినా గెలిపిస్తామని శంకరమ్మ అన్నారు.