తెలంగాణ

రాష్ట్రం కోసం ‘బాబు’నే బ్లాక్ మెయిల్ చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనుకూలంగా లేఖ ఇప్పించేందుకు తాను చంద్రబాబు నాయుడినే బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తినని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆర్టీసీ కార్మిక నేతలు తనను తెలంగాణ ద్రోహి అని ఎలా అంటారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మిక నేతలు తనపై చేసిన విమర్శలపై సోమవారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లి స్పందించారు. తెలంగాణ కోసం తాను జైలుకెళ్లిన విషయం వారికి తెలుసో లేదో తెలియదన్నారు. తనపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొట్టడంపైనే తాను మాట్లాడానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కార్మికులను రెచ్చగొడుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. రైతుబంధు, ఆసరా పథకాలను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేశామని ఎర్రబెల్లి వివరించారు.