తెలంగాణ

ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు ఎప్పటికీ అమరులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులు నిబద్దత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని సీఎం తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అర్పిస్తున్నారన్నారు. పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళి అర్పించారు.