తెలంగాణ

త్వరలో 100 శాతం బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: త్వరలో 100 శాతం బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానీయాతో కలిసి కలెక్టర్లు, ఆర్టీవోలు, జేటీసీలు, ఈడీలు, ఆర్టీసీ డిపో మేనేజర్లతో మంత్రి అజయ్‌కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికులకు తప్పనిసరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాస్‌లు, రాయితీ పాస్‌లను అనుమతించాలని మంత్రి ఆదేశించారు. తాత్కాలిక కండక్టర్లకు టికెట్లు ఇవ్వడానికి టిమ్ మిషన్లు అందజేయాలన్నారు. అవసరమైన మేరకు డిపోల్లో మెకానిక్‌లను, ఎలక్ట్రిషియన్లను నియమించుకోవాలని ఆదేశించారు.