తెలంగాణ

వామపక్ష నేత రుద్రరాజుకు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: కొద్దికాలంగా అనారోగ్యంతో అస్వస్థతకు గురైన సీపీఎం సీనియర్ నేత రుద్రరాజు సత్యనారాయణ రాజును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీమవరం వెళ్లి పరామర్శించారు. వీరభద్రం వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బీ వెంకట్, ఎం సాయిబాబు, పీ ప్రభాకర్‌లున్నారు. ఈ సందర్భంగా రుద్రరాజుతో గత ఉద్యమాలను వీరభద్రం గుర్తుచేశారు. తమ్మినేని సొంత గ్రామం తెల్దారుపల్లిలో భూస్వాములు సీపీఎంపై దాడులు చేసినపుడు రుద్రరాజు తెల్దారుపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్, తమ్మినేని వ్యవసాయ కార్మిక పోరాటాలు, గ్రామీణ పోరాటాల్లో కలిసి చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు బలరాం, గోపాల్, జుత్తిగ నర్సింహమూర్తి, రాజరామ్మోహన్‌రాయ్, జక్కంశెట్టి సత్యనారాయణ, వాసు తదితరులు కూడా రుద్రరాజును పరామర్శించిన వారిలో ఉన్నారు.