తెలంగాణ

రజాకర్లను మించిన నయా నిజాం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: హిందువులను ఘోరాతి ఘోరంగా హింసించి చిత్రవధ చేసిన రజాకర్లను మరిపించేలా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతోందని , కేసీఆర్ నయానిజాంలా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ఆరోపించాయి. నిర్మల్ జిల్లా బైంసాలో హిందువులపై జరిగిన దాడులను నిరసిస్తూ శనివారం నాడు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బజరంగ్‌దళ్ కన్వీనర్ సుభాష్ చందర్ మాట్లాడారు. రాష్ట్రంలో హిందువులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని, ఈ విషయంలో ఏ రాజకీయ నాయకుడూ స్పందించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్‌ను పట్టుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాను నడుపుతున్న వాహనాన్ని ఏకంగా హిందువులపై తీసుకువెళ్తున్నారని అన్నారు. బైంసాలోని హిందువుల ఇళ్లపై ఏకధాటిగా వందలాది మంది దాడి చేసి ద్విచక్రవాహనాలను, ఆటోలను , ఇళ్లనూ ధ్వంసం చేసి నగదు, నగలు దోచుకున్నారని అన్నారు. పరాయిమతస్తుల కాలికి ముళ్లు గుచ్చుకుంటే కంట్లోంచి రక్తం కారేలా ఏడ్చి మొత్తకునే నాయకులు, మీడియా ఈ రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. హిందువుల రోదనలు, వేదనలు ఏ సెక్యూలరిస్టుకూ పట్టవని అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ , నల్గొండ జిల్లాల్లో బజరంగ్‌దళ్ నాయకులను ముందుగానే అరెస్టు చేశారని, పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.