తెలంగాణ
నిజాంపేటకు అత్యధిక ఓట్ల మెజారిటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 January 2020
హైదరాబాద్, జనవరి 25: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఘనత మెడ్చెల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్కు దక్కింది. ఇక్కడ అధికార పార్టీ నుండి పోటీ చేసిన కాసాని శిరీష 1698 ఓట్లు సాధించి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 1577 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డుకెక్కింది. కేవలం 121 ఓట్ల స్వల్ప ఓట్లు సాధించి ప్రధాన పార్టీ అభ్యర్థి ఓడిపోగా ఈ కార్పోరేషన్లోనే ప్రధాన ప్రతిపక్షం లేకుండా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ అభ్యర్థి చైర్మన్ ఎన్నికల్లో పోటీ పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
'చిత్రం... టీఆర్ఎస్ అభ్యర్థి కాసాని శిరీష