తెలంగాణ

మేడారం జాతరలో అసౌకర్యాలకు తావీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి మేడారం వెళ్లిరావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను
అందుబాటులో ఉంచుతామన్నారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత తదితరులు ముఖ్యమంత్రిని కలిసి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు పారిశుద్ధ్యం తదితర విషయాల్లో ఏ మాత్రం ఏమరపాటు మంచిది కాదని సీఎం అన్నారు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలన్నారు. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపాలన్నారు. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు.

'చిత్రం...మేడారం జాతరకు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదివారం ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత