తెలంగాణ

‘మహా నటి’ గ్రీన్ చాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి సినీ హీరోయిన్లు స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో హీరోయిన్లు కీర్తి సురేష్ (మహా నటి ఫేమ్), కౌసల్య మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ సూరారంలోని టెక్ మహేందర్ కశాశాల ఆవరణలో కీర్తి సురేష్ మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా తాను మొక్కలు నాటానని, నా లాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె సూచించారు. వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో గ్రీన్ చాలెంజ్ కార్యక్రమానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. మరో హీరోయిన్ కౌసల్య మాట్లాడుతూ గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.