తెలంగాణ

మీరే రేపటి నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చాక మారకూడదు. లేని గొప్పతనానికి, ఆడంబరాలకు వెళ్లవద్దు. ఐదు కోట్ల మంది ప్రజల్లో 140 మందికే మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీనిని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లవచ్చు‘ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హితవు పలికారు. ప్రగతిభవన్‌లో మంగళవారం జరిగిన రాష్టస్థ్రాయి మున్సిపల్ సదస్సులో ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ కర్తవ్య బోధ
చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, భర్తృహరి సుభాషిత పద్యాన్ని చదివి, అర్థ తాత్పర్యాన్ని సీఎం వివరించారు. ‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకొని ఉండేవి. స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాం. జాతి నిర్మాణంలో మనమంతా మమేకం కావాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘బాధ్యతలను గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది’ అని ఆయన అన్నారు. ‘విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి కత్తిమీద సాము లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయొద్దు. చాలా కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వస్తే బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండుసార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచే వరకే రాజకీయం. తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది’ అని ఆయన అన్నారు. ‘మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలామందికి ఆత్మవిశ్వాసం తక్కువ. అలా ఉండకూడదు. అవగాహనతో అర్థం చేసుకోవాలి. చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని సమీకృతం చేయగలిగితే గొప్ప ఫలితాలు సాధిస్తాం. ప్రస్తుతం ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. సంకల్పం ఉంటే వందశాతం విజయం సాధిస్తారు’ అని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు.
‘మున్సిపాలిటీ అంటేనే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరుగా తయారైంది. బల్దియా...ఖాయా పీయా చల్దియా అనే సామెతలు పుట్టుకొచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు కాదు. అది మీ చేతుల్లోనే ఉంది’ అని సీఎం గుర్తు చేశారు. ‘ప్రజా ప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు రాత్రికి రాత్రి చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్రణాళిక ఉండాలి. మంచి అవగాహన ఏర్పర్చుకోవాలి. సమగ్ర కార్యాచరణ రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకొని ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి పనులపై దృష్టి సారించాలి’ అని ఆయన హితవు చెప్పారు. ‘ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారిన పడతాయి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. మేయర్లు, చైర్‌పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యిం సాధించి ఉత్తములుగా నిలవాలని పిలుపునిస్తూ ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపించి, దాని అర్థ తాత్పార్యాన్ని వివరించారు.

*చిత్రం... ప్రగతిభవన్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మేయర్లు,
మున్సిపల్ చైర్‌పర్సన్లు, కమిషనర్లు