తెలంగాణ

‘కోటి’ గ్రీన్ ఇండియా చాలెంజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే తమ వంతు కర్తవ్యంగా మొక్కలు నాటాలన్నారు. మహోత్తరమైన మొక్కలు నాటే గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు, టీఆర్‌ఎస్ నేత చక్రధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ వాసులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
*చిత్రం... గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న కోటి