తెలంగాణ

23 నుంచి ఎంసీపీఐయూ రాష్ట్ర ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఎంసీపీఐయూ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనున్నట్టు కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. గురువారం నాడు ఆయన ప్లీనరీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లీనరీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మతోన్మాదం, ధరల పెరుగుదల తదితర అంశాతో పాటు కమ్యూనిస్టుల ఐక్యత, సామాజిక న్యాయం అంశాలపై తగిన నిర్ణయాలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎంపికైన పార్టీ ప్రతినిధులతో జరిగే ఈ ప్లీనరీని జయప్రదం చేయాలని ఎంసీపీఐయూ నేతలు మద్దికాయల అశోక్, గాదగోని రవి, వనం సుధాకర్‌లు పేర్కొన్నారు.