తెలంగాణ

తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 22: ప్రేమ వ్యవహారం దారుణ హత్యకు దారితీసింది.. మాజీ ప్రియుడే హంతకుడు.. ‘తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనే..’ సినిమా డైలాగును మరిపించేలా హత్యోదంతం వెలుగుచూసింది. పెళ్ళిచూపుల రోజే కాపుకాసి హత్యకు ఒడిగట్టాడు ఓ భగ్న ప్రేమికుడు. ఈ సంఘటన నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. న్యూ హఫీజ్‌పేటలోని మార్తాండ నగర్‌లో నివసిస్తున్న సెంట్రింగ్ కార్మికుడు గౌస్‌పాషా (26) అదే బస్తీలో నివసిస్తున్న ఓ యువతిని రెండేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. కాగా కొంతకాలం నుంచి రాజస్థాన్ లోని ఈటా జిల్లా, అలిపూర్‌కు చెందిన షరాఫత్‌తో ఆ యువతి ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. అదే బస్తీలో ఉంటున్న తన మేనమామ వద్ద గ్లాస్ వర్క్ షాపులో పనిచేస్తున్న అతను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. కాగా శుక్రవారం తల్లిదండ్రులను తీసుకుని తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రేమికుడు గౌస్‌పాషా అతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలనుకున్నాడు.. షరాఫత్ కోసం కాపుకాశాడు. బయటికి వచ్చిన షరాఫత్‌కు మాయమాటలు చెప్పి నమ్మించి మార్తాండ నగర్‌లోని దర్గా సమీపంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది దారుణంగా చంపేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూకట్‌పల్లి ఏసిపి భుజంగరావు, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. హతుడి తండ్రి మఫోజ్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.