తెలంగాణ

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: త్వరలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో ఒక సమగ్ర నివేదికను రూపొందించి పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు సమర్పించనున్నట్లు చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాలను ముందుగా బలోపేతం చేస్తామన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటిస్తామన్నారు. టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘం పార్టీకి వెన్నుముక అని ఆయన అన్నారు. మొదటి నుంచి టీఎన్‌టీయూసీకి పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కేడర్ చెక్కుచెదరలేదని, అందరినీ ఏకతాటిపైకి తెస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే మహిళా కమిటీలను నియమించామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగుచెంది ఉన్నారని, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. నియంతృత్వ పాలన వల్ల మానవ , పౌర హక్కులు హననమవుతున్నాయన్నారు. ప్రచారంతో పబ్బం గడుపుకుందామని చూస్తున్న కేసీఆర్ ఎత్తుగడలను జనం సహించరని ఆయన అన్నారు.