తెలంగాణ

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులతో పాటు సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను సమావేశానికి ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. కాగా, ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంతమంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో రాష్టవ్య్రాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు
పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తర్వాతనే ఇళ్లకు పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తోందన్నారు. గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమికూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా ఉండాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జనం ఒకేచోట గుమికూడవద్దని సీఎం సూచించారు.