తెలంగాణ

కన్న కొడుకునే కడతేర్చిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, ఆగస్టు 2: పెంచి పెద్ద చేసి ప్రేమానురాగాలు పంచాల్సిన తండ్రి కన్న కొడుకును కడతేర్చాడో ఓ కసాయి. సంఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోనవేని సంజీవ్ అనే వ్యక్తి తన కొడుకు రంజిత్ (12)ను పథకం ప్రకారం ముందే హతమార్చి తన తన ట్రాక్టర్ కేజివీల్ కింద పడిపోయి ప్రమాదవశాత్తు చనిపోయాడని కట్టుకథ అల్లే ప్రయత్నం పోలీస్ విచారణలో తేలింది. సంజీవ్ ఆయన భార్య రాజేశ్వరి విబేధాల మూలంగా గత కొంత కాలం నుండి వేర్వేరుగా గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. వీరికి ఇరువురు కుమారులు కాగా, పెద్ద కొడుకు రంజిత్ తండ్రి దగ్గర, చిన్న కొడుకు వినయ్ తల్లి దగ్గర ఉంటున్నారు. అయితే తండ్రి దగ్గర ఉన్న రంజిత్ సోమవారం సాయంత్రం తల్లికి ఫోన్ ద్వారా తన ఆరోగ్యం బాగా లేదని, డాక్టర్‌కు చూపించాలని ప్రాధేయపడ్డాడు. దీంతో కొడుకు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లగా కొడుకు కనిపించకపోవడంతో భర్తను నిలదీయగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పారిపోయాడని ఒకసారి, వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లగా అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన రాజేశ్వరి బంధువులకు, గ్రామస్థులకు రోధిస్తూ తెలిపింది. వీరంతా బాలుని కోసం వెతికి అతని జాడ తెలియకపోవడంతో మంగళవారం ఉదయం సదరు సంజీవును నిలదీయడంతో తన వ్యవసాయ బావి వద్ద పొలం దున్నుతుండగా ట్రాక్టర్ కేజివీల్ కింద పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలంలో సైతం ప్రమాదవశాత్తుగా మృతి చెందినట్లుగా ఆనవాళ్లు లేకపోవడం, మరింత అనుమానాలకు బలమివ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించడంతో నిందితుడు నిజం ఒప్పుకున్నాడు.
అనారోగ్యంతో ఉన్న కొడుకును ఆసుపత్రికి చూపించలేకనే కోపంతో బలంగా కొట్టడంతో మృతి చెందగా ప్రమాదసంఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశానని ఒప్పుకున్నాడు. సంఘటనా స్థలాన్ని సిఐ భూమయ్య సందర్శించారు. మృతుడు స్థానిక హైస్కూళ్లో ఆరవ తరగతి చదువుతుండడంతో సంతాప సూచకంగా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు భర్త సంజీవుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.