తెలంగాణ

క్యారీబ్యాగ్‌లో మృతపిండాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు గురైన సుమారు ఐదు నెలల వయసు గల మూడు పిండాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్యా రీబ్యాగ్‌లో గర్భస్రావం చేసిన ఈ పిండా లతో పాటు వైద్యులు, సిబ్బంది వాడిన గ్లౌజులు, ప్రిస్క్రిప్షన్ చీటీలు పడేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రీమియం అని ముద్రించిన ఆ క్యారీబ్యాగ్‌పై మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ ఎం. శే్వతారెడ్డి పేరిట వచ్చినదిగా పోలీసులు, వైద్యాధికారులు గుర్తించారు. ఈ సంఘట నను గమనించిన కొంతమంది వ్యక్తులు టూటౌన్ ఇన్స్‌పెక్టర్ కె.పాండురంగారెడ్డికి సమాచారం ఇవ్వగా ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యారీబ్యాగ్‌లో ఉన్న కాగితాలు, క్యారీబ్యాగు, మృతపిండాలను సేకరించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణకుమారి, పిపి యూనిట్ డాక్టర్ సాహితి, డిపిఎం భగవాన్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ కృష్ణకుమారి జరిగిన విషయాన్ని డిఎస్‌పి రాంగోపాలరావుకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు టూటౌన్ ఇన్స్‌పెక్టర్ కె.పాండురంగారెడ్డి తెలిపారు. ఇదిలావుండగా, భ్రూణహ త్యలకు పాల్పడ్డ ఎలాంటి వారైనప్పటికీ కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ తెలిపారు.