తెలంగాణ

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీజి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 4: ప్రధాని నరేంద్రమోదీ మెదక్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీజి బృందం గురువారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించింది. ప్రధాని గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈనెల 7న వస్తున్న సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డిఐజి నేతృత్వంలో అధికారుల బృందం గురువారం ఏర్పాట్లు పరిశీలించింది. ఈ సందర్భంగా డిఐజిలు నాగిరెడ్డి, అకుల్‌సబర్వాల్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌లకు భద్రతాపరమైన సూచనలు చేశారు. కోమటిబండ పరిసరాలలో తీసుకున్న భద్రతా చర్యలను వారు పోలీసు ఉన్నతాధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు.

చిత్రం.. ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీస్తున్న ఎస్పీజి బృందం