తెలంగాణ
సిఎం కెసిఆర్ అభీష్టం నెరవేరాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఆగస్టు 11: ఆధ్యాతిక భావనలను పెంపొందించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అభీష్టం నెరవేరాలని దేవానాధ రామానుజ జీయర్ స్వామి, త్రిదండి శ్రీనివాస వ్రతధార రామానుజ జీయర్ స్వామి, 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ అభిలషించారు. పుణ్యక్షేత్రాల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక భావనలను పెంపొందిస్తున్న కెసిఆర్కు భగవంతుడు శుభం చేకూర్చాలని ఆశ్వీరదించారు. గురువారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్కు చేరుకున్న ముఖ్యమంత్రి పీఠాధీపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అలంపూర్కు బస్సులో వెళ్లుతుండగా మార్గమధ్యంలో రంగాపూర్- బీచుపల్లి పుష్కర ఘాట్ను సందర్శించారు. సంప్రదాయాన్ని అనుసరించి ముఖ్యమంత్రి కృష్ణానదిలోకి నాణేలను జార విడిచారు.
చిత్రం..ముఖ్యమంత్రి కెసిఆర్ను ఆశీర్వదిస్తున్న దేవానాధ రామానుజ జీయర్ స్వామి