తెలంగాణ

ఎన్‌ఐఏ కేసుల విచారణకు రెండు కోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రం పరిధిలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టిన కేసులపై రెండు కోర్టులు విచారణ జరుపుతాయని హైకోర్టు ప్రకటించింది. నాంపల్లిలోని నాల్గవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు, రంగారెడ్డి జిల్లాలోని ఎల్‌బి నగర్ ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఎన్‌ఐఏ కేసులను విచారిస్తాయని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కోర్టులను ప్రత్యేక కోర్టులుగా హైకోర్టు గుర్తించింది.