రాష్ట్రీయం

‘30వేల ఫిర్యాదులను పరిష్కరించాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ఈ సంవత్సరం ఇంతవరకు సమాచార కమిషన్‌కు 31,662 అపీల్స్, ఫిర్యాదులు రాగా, 30301 అపీల్స్, ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఉమ్మడి రాష్ట్రాల సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్ తెలిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలను ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన రవీంద్రభారతిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.