తెలంగాణ

దైవ దర్శనానికి వెళుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 5: స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మారో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కొండాపూర్ ఎఎస్‌ఐ రజాక్ కథనం ప్రకారం... రామచంద్రాపూర్‌లో నివాసం ఉండే కారు డ్రైవర్ కుమార్ (34) స్నేహితులు చంద్రశేఖర్‌చారి, వెంకటేష్‌చారి (35), శేఖర్ (35)తో కలిసి మహారాష్టల్రోని షిరిడికి తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎపి 09 బిఎక్స్ 7117 నంబరు గల వరుణ కారులో బయలుదేరారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న హైదరాబాద్ పంక్షన్‌హాల్ వద్దకు రాగానే జిజె 12 వై 7654 నంబరు గల లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.