తెలంగాణ

‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట కెసిఆర్ మోసం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నికల ముందు పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత ఇళ్ల నిర్మాణం చేయకుండా మోసం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 90వేల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు.