తెలంగాణ

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇఓడిబి)లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం పట్ల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును అభినందిస్తూ లేఖ రాశారు. వరల్డ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రం ఇఓడిబి సంస్కరణల్లో మొదటి స్థానంలో నిలవడం ముఖ్యమంత్రి కెసిఆర్ అసాధారణ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యమని ఆ సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడం, ప్రత్యేకంగా డిజిటల్, ఇంటర్నెట్ విభాగాల్లో కలిసి నడవటం తమకు గర్వంగా ఉందని శ్వాబ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది 2017 జనవరిలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానించారు.