తెలంగాణ

ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీని గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, డిసెంబర్ 11: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీటిసి, ఎంపిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్‌లకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో నియోజకవర్గంలోని నేరడిచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచె ర్వు, హుజూర్‌నగర్ మండలాల జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్‌ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో నల్లగొండ జిల్లాలో 80 శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని.. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. పార్టీకి జిల్లాలో స్పష్టమైన అత్యధిక మెజార్టీ ఉన్నదని ప్రజాప్రతినిధులు ఐక్యంగా పనిచేసి ఎలాంటి ప్రలోభాలకు, బెదరింపులకు లొంగవద్దని.. 2019లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భువనగిరి ఎంపిగా, తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన అభ్యర్థి అని.. ఆయనను గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.