తెలంగాణ

సతీసమేతంగా యాగానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి సతీసమేతంగా రావాల్సిందిగా గవర్నర్ దంపతులను సిఎం కె చంద్రశేఖర్‌రావు దంపతులు ఆహ్వానించారు. సోమవారం ఉదయం విజయవాడ వెళ్లి తిరిగొచ్చిన సిఎం కెసిఆర్, భార్య శోభ, మనమడితో కలిసి సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, భార్య విమల దంపతులకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రం, పూలు, పండ్లతో కలిపి అయుత చండీయాగం ఆహ్వాన పత్రాన్ని అందించారు. చండీయాగానికి రావాల్సిందిగా ఇదివరకే గవర్నర్‌ను సిఎం ఆహ్వానించినప్పటికీ, భార్యసహా వెళ్లి గవర్నర్ దంపతులకు సోమవారం ఆహ్వానపత్రం మర్యాదపూర్వకంగా అందించారు. చండీయాగం ముగింపు రోజున రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ యాగానికి రానుండటంతో, ఆయనతోపాటు గవర్నర్ ఎలాగూ వస్తారని, అయితే అంతకుముందు ప్రత్యేకంగా ఒకరోజు గవర్నర్ దంపతులను యాగానికి వచ్చి వెళ్లాల్సిందిగా సిఎం ఆహ్వానించినట్టు తెలిసింది.