తెలంగాణ

మాది చీప్‌లిక్కర్ అయితే మీది గుడుంబా పార్టీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 25: తమ పార్టీని, నాయకులను చీప్‌లిక్కర్‌తో పోల్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ది గుడుంబా పార్టీనా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పోరిక బలరాంనాయక్ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిఎం కురవి వీరభద్రస్వామి దర్శనం సందర్భంగా మాట్లాడిన మాటలపై బలరాంనాయక్ కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు నెలల్లోనే చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలని చూసిన ముఖ్యమంత్రి చీప్ బుద్ధి అప్పుడే తెలిసిందన్నారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయతాన్ని మానుకున్నారని ఆయన చెప్పారు. పొద్దంతా తాగే వారికే ఇలాంటి చీప్‌లిక్కర్ మాటలు వస్తాయని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకులను దొంగల ముఠాగా పోల్చిన ముఖ్యమంత్రి పార్టీ టిఆర్‌ఎస్ అలీబాబా నలుగురు దొంగలని ఘాటుగా స్పందించారు. ఆంధ్రానాయకులకు మూటలు మోసింది తాము కాదని, మిషన్ భగీరథ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్‌లకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మూట లు మోసేది నీవు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దళిత, గిరిజన, మైనార్టీలను మోసం చేసిన ముఖ్యమంత్రి తాజాగా వారి ఖాతాలోనే బిసిలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంబిసికి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి వెయ్యి కోట్లు కేటాయిస్తాననడం పచ్చి మోసమని ఆయన అన్నారు. దళితులకు ఇచ్చిన మూడెకరాల భూమి, గిరిజన, మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్‌ల అమలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి మోసపూరిత హామీలతో ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తావని ప్రశ్నించారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, చేపలు అంటు దాటవేసే ధోరణి సరికాదన్నారు. ఇతర పార్టీల నుండి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టిఆర్‌ఎస్‌లోకి తీసుకున్న కెసిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే వారితో రాజీనా మా చేయించి మళ్లి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. తమ నాయకులను సన్నాసులతో పోల్చిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలే సన్నాసులని ఆయన అన్నారు. 40 ఏళ్ల అధికారంలో ఉండి కూడా తాము ఏమీ చేయలేదన్న కెసిఆర్ గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి, టిఆర్‌ఎస్ మూడేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనన్నారు. బహిరంగ చర్చకు ఎక్కడికి రావా లో నిర్ణయించి చెప్పాలని సవాల్ విసిరారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.