తెలంగాణ

కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు, సన్నాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు.. సన్యాసులు.. పదవుల కోసం, పైసల కోసం నాటి పాలకులకు పాదాల వద్ద మోకరిల్లే విధంగా వ్యవహరించారు, డబ్బుల సంచులు మోసారు.. అందుకే రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా తీసింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తే సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ శిఖండి పాత్ర పోషిస్తున్నారు.. అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో గురువారం రాత్రి జరిగిన టిఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరంగసభలో పార్టీ అధినేత కెసిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఖరిని తూర్పార బట్టారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు తాను అడ్డం కాదు.. నిలువు కాదంటూ వ్యంగ్యంగా మాట్లాడితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపలేదని, తమ పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. అదే విధంగా అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఈటల రాజేందర్ నాయకత్వంలోని తెరాస ఎమ్మెల్యేల బృందం కోరితే నిండు సభలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదంటూ అహంకారపూరితంగా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు విప్పలేదని నిలదీశారు.
పదవుల కోసం నాడు కాంగ్రెస్ నాయకులు సంచులు మోశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలంగాణ స్థితిగతులను మార్చుకుందామనే ప్రయత్నంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం పూనుకుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒకటి, రెండు సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని, కానీ సాంకేతిక లోపాలను ఆధారంగా తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం జరుగకుండా కాంగ్రెస్ అడ్డుపడటం నీతిమాలని చర్యగా అభివర్ణించారు.
పర్యావరణ తదితర అనుమతులు లేవంటూ కోర్టుల ద్వారా స్టే తెస్తూ శిఖండి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చొరవతో పాత ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి 65వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఇదే తరహాలో ఇతర ప్రాజెక్టులన్నీ పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారనుందని వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే తమకు పుట్టగతుల ఉండవనే భయంతోనే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు రావనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

చిత్రం..వరంగల్‌లో గురువారం నిర్వహించిన టిఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరంగసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్