తెలంగాణ

జూన్ 8న మృగశిర కార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: మృగశిర కార్తె రోజున జూన్ 8న చేప మందు పంపిణీ జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మృగశిర కార్తెనాడు నిర్వహించే చేప మందు పంపిణీ పై వివిధ శాఖల అధికారులతో మంత్రి సచివాలయంలో మంగళవారం సమావేశం అయ్యారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చేప మందు కోసం వస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. చేప మందు పంపిణీకి అవసరం అయినన్ని చేపలు సైతం అందుబాటులో ఉండే విధంగా ముందే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.