తెలంగాణ

నర్సారెడ్డికి రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ చైర్మన్‌లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని ఎంపిక చేశా రు. ఉమెన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా)ని నియమించారు. తెలంగాణ రాష్ట్ర హౌజిం గ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా), తెలంగాణ ఫిల్మ్, టీవి అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పుష్క ర్ రామ్మోహన్‌రావు (ఆదిలాబాద్- మందమర్రి)ని నియమించారు. తెలంగాణ రాష్ట్ర వికాలంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కె వాసుదేవరెడ్డి (కాకతీయ వర్శిటీ విద్యార్థి నేత)ను నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ (గోషామహల్)ను నియమించారు. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఉస్మానియా విద్యార్థి నేత- పెద్దపల్లి)ని నియమించారు. తెలంగాణ మహిళ సుధారాణి తెరాస తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ గుండు సుధారాణిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షునిగా ఉస్మానియా వర్శిటీ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (కరీంనగర్)ను నియమించారు. మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున, తిరిగి హైదరాబాద్‌కు రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో సిఎం కెసిఆర్ నిర్ణయిస్తారని సిఎంవో పేర్కొంది.