తెలంగాణ

దళితుల అభివృద్ధికి మోదీ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఆగస్టు 20: దళితుల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఒక్క దళితుడు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు తోడ్పాటునందించాలని కోరారు. సిరిసిల్ల-రాజన్న జిల్లా నేరెళ్లలో ఇటీవల జరిగిన సంఘటన బాధాకరమని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. దళితుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో రాములును ఘనంగా సన్మానించారు. దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు బాకి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, తీగల రత్నం తదితరులు పాల్గొన్నారు.