తెలంగాణ

వినాయక విగ్రహాల ఎత్తు 20 అడుగులకు మించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: గణేశ్ పండుగ సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల ఎత్తు 20 అడుగులకు మించకుండా చూడాలని హైకోర్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సలహా ఇచ్చింది. నగరానికి చెందిన వేణుమాధవ్ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్సవ సమితికి ఈ సూచన చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా భారీ గణేశ్ విగ్రహాలను పలు చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ గణేశ్ విగ్రహాల ఏర్పాటు అనుమతికి అధీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సమితి తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సమితి తరఫున హాజరైన ప్రతినిధి కోర్టును కోరారు. దీంతో కోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.