తెలంగాణ
ఉప రాష్టప్రతికి బేగంపేటలో వీడ్కోలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 September 2017
హైదరాబాద్, సెప్టెంబర్ 18: భారత ఉప-రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు తెలంగాణలో రెండు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు వెంకయ్యకు వీడ్కోలు పలికారు. వీడ్కోలు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్, డిజిపి అనురాగ్ శర్మ, రాజ్భవన్ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్ సింగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సోమవారం బేగంపేట విమానాశ్రయంలో ఉప రాష్టప్రతి వెంకయ్యకు
శాలువా కప్పి వీడ్కోలు పలుకుతున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ