తెలంగాణ

గంజాయి స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అంతర్రాష్ట గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ముంబయికి చేర వేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15,000ల నగదుతోపాటు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన వారిలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మస్తాన్ ఖురేషి (24) మన్సూర్ ఖురేషి (28) ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జి రమా సత్యనారాయణ (33) ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూర్ ఆలమ్ షేక్ (20) ముంబయికి చెందిన శ్రీను (35) ఉన్నారు. ముంబయికి చెందిన ముజాహిద్ (23), రేష్మా (21) పరారీలో ఉన్నట్టు అదనపు టాస్క్ఫోర్స్ డిసిపి శశిధర్ రాజు తెలిపారు.