తెలంగాణ

దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మట్లాడుతూ మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అనేక రాష్ట్రాల నేతలు మన రాష్ట్రానికి వచ్చి పరిపాలనపై పాఠాలునేర్చుకుంటున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూలు జిల్లా, గద్వాల, వనపర్తి జిల్లాలు భవిష్యత్తులో అభివృద్ధికి నిదర్శనంగా మారుతాయన్నారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధనకు కెసిఆర్ ప్రభుత్వం కృషి చేసి విజయం సాధించిందన్నారు. రాష్ట్రంలో కరెంటు కొరత లేకుండా చేశామన్నారు. దీని వల్ల పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. 40వేల కోట్ల రూపాయలతో ప్రజలకు ఇంటింటికీ నీరు ఇస్తున్నామన్నారు. టిడిపిలో రేవంత్ రెడ్డి లాంటి నేతలు రాష్ట్ర అభివృద్ధికి విచ్ఛిన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర నేతలు పాల్గొన్నారు.