తెలంగాణ

జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఐపీఎస్ అధికారి ప్రస్తుతం మహరాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న ఆయన ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులు ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.