తెలంగాణ
మైనారిటీ గురుకులంలో టీచర్ల దాష్టీకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 November 2017
ఆదిలాబాద్, నవంబర్ 20: ఆదిలాబాద్ మండలం పిట్టలవాడ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు కాపీ కొట్టారని ఆగ్రహిస్తూ క్లాస్ టీచర్, పీఈటీ కొందరు విద్యార్థులను సోమవారం పనిష్మెంట్ కింద 25 నుండి 50 గుంజీలు తీయంచారు. దీంతో 11మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో స్పృహ తప్పిపోయన ఐదుగురు విద్యార్థులను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అదుపులో ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.