తెలంగాణ

సిఎం సహాయనిధికి విద్యార్థుల విరాళం 2వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు స్వయంగా సేకరించిన రెండువేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ విరాళాలు ఉపయోపడాలని ఆకాంక్షించారు. సమాజంలో అనాథలు, అభాగ్యులు, సరైన వర్షాలు లేక రైతులు పడుతున్న కష్టాలు చూసి చలించిన విద్యార్థులు విరాళాలు సేకరించి తమ వంతు సహాయం అందించారు. రెండువేల రూపాయల డిడిని విద్యార్థుల అభిప్రాయాలతో కూడిన లేఖను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. భారతి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు పంపించారు. విద్యార్థుల సామాజిక స్పృహ అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు.