తెలంగాణ

తరలివస్తున్న ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్‌లో ఈ నెల 15 నుండి 19 వరకు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల నుండి ప్రతినిధులు తరలి వస్తున్నారని, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) సమన్వయ కర్త మహేశ్ బిగాల తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, మలావి, బోట్స్వానా, జాంబియా తదితర 42 దేశాల నుండి 450 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తాను (మహేశ్ బిగాల) వివిధ దేశాల్లో పర్యటించి, తెలుగు మహాసభల గురించి తెలియచేశానని, దాంతో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చారన్నారు. విదేశాల నుండి వస్తున్న ప్రతినిధులకు మేరీగోల్డ్, పార్క్, హరితప్లాజా తదితర హోటళ్ల్లలో బస ఏర్పాటు చేశామని మహేశ్ తెలిపారు.