తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వైరా ఎమ్మెల్యేకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 28: సూర్యాపేట- ఖమ్మం రహదారిపై చివ్వెంల మండలం అక్కల్‌దేవిగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యుడు బానోతు మదన్‌లాల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా నుండి హైదరాబాద్‌కు ఇన్నోవా వాహనంలో ఎమ్మెల్యే వెళ్తుండగా అక్కల్‌దేవిగూడెం మూలమలుపు వద్ద హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు గాయాలు కాగా 108 వాహనంలో సూర్యాపేటలోని చంద్రశేఖర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు నడుం భాగంలో గాయాలైనట్లు గుర్తించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చివ్వెంల ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

chitram ప్రమాదంలో గాయాలైన వైరా శాసనసభ్యుడు బానోతు మదన్‌లాల్‌