తెలంగాణ

జైళ్లశాఖ క్రిస్మస్ బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ జైళ్లశాఖ క్రిస్మస్ సందర్భంగా బోనాంజా ప్రకటించింది. బిచ్చగాళ్ల సమాచారమిచ్చిన వారికి రూ. 500 నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చే లక్ష్యసాధనలో భాగంగానే ఈ నజరానా అందజేయనున్నట్టు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు నగరంలో యాచక వృత్తిని చేపట్టే వారిని పట్టుకుని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలోని ఆనంద ఆశ్రమంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ముందు నగరవ్యాప్తంగా 480 మంది యాచకులను జైళ్లలోని ఆనంద ఆశ్రమం పునరావాస కేంద్రాలకు తరలించామని, వీరిలో 316 మంది పురుష, 164 మంది మహిళ యాచులున్నారు. అయితే వీరికి తగిన రీతిలో కౌనె్సలింగ్ ఇస్తూ, మొత్తం 401 మంది బిచ్చగాళ్లలో 261 మంది పురుష, 140 మంది మహిళ యాచకులను విడుదల చేశామని డీజీ తెలిపారు.