తెలంగాణ

అధికార దుర్వినియోగం చేస్తున్న నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 29: టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత నామినేషన్ దాఖలు సందర్భంగా ఖమ్మంలో వారు మాట్లాడుతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ టిఆర్‌ఎస్ గెలవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటంతో పాటు ఇతర పార్టీల నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటుందన్నారు. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రజలను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ అధికారం అండంతో ఇష్టారీతిన వ్యవహరిస్తుందన్నారు.